దేశవ్యాప్తంగా మే 31 వ తేదీ వరకు విధించిన నాలుగో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ అమలులో పలు రంగాలకు సడలింపులు ఇవ్వగా తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది. ఈసారి రవాణా, వ్యక్తిగత వాహనాలకు సంబంధించి మినహాయింపులు ఇచ్చారు.
ఏపీలో తాజాగా ప్రకటించిన మినహాయింపులు:
- రాష్ట్రంలో ఆటోలకు అనుమతి – 1+2 (డ్రైవర్ సహా ఇద్దరు)
- కార్లకు అనుమతి – 1+3 (డ్రైవర్ సహా ముగ్గురు)
- ఇతర ప్రైవేట్ వాహనాలు, మినీ వ్యాన్లు – 50 శాతం ప్రయాణికులతో అనుమతి
- కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణీకులకు అనుమతి
- లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలి
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu