భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ మే 4న తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సమైక్య భారత్ నిర్మాణమనే మన సామూహిక స్వప్నాన్ని బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మన పార్లమెంటరీ కార్యకలాపాల ఉత్పాదకతను, సమర్థతను పెంపొందించడానికి ఆయన చేస్తున్న నిరంతర కృషి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న ప్రగాఢ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పేదలు, అణగారిన వర్గాల పట్ల శ్రద్ధతో కూడిన సర్వతోముఖాభివృద్ధి పట్ల ఆయనకున్న అచంచలమైన అభిరుచి కూడా అంతే స్ఫూర్తిదాయకం. ఆయన ప్రజా జీవితం అంకితభావం, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్య సాధనతో ముందుకు సాగుతోంది. ఆయన మంచి ఆరోగ్యం, ఆనందంతో దేశ సేవలో దీర్ఘాయువును పొందాలని నేను ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
Warm birthday greetings to Vice President Thiru CP Radhakrishnan Ji. He is making numerous efforts to strengthen our collective dream of building a Viksit Bharat. His consistent efforts to enhance the productivity and effectiveness of our Parliamentary proceedings reflect his…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. సి.పి.రాధాకృష్ణన్ తన నిబద్ధతతో దేశానికి మరిన్ని సేవలు అందించాలని, దేశ ప్రగతి కోసం ఆయన చేసే ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకున్నారు. ఆయన నిజాయితీ మరియు స్థిరమైన నాయకత్వం పార్లమెంటరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Wishing our Hon’ble Vice President Shri C. P. Radhakrishnan ji a very happy birthday. I extend my sincere wishes for his good health, long life, and continued dedication in service to the nation. May he achieve further success in his endeavours for the progress of our country and… pic.twitter.com/B2Md8zuUET
— N Chandrababu Naidu (@ncbn) May 4, 2026
అంకితభావం, క్రమశిక్షణ
సి.పి.రాధాకృష్ణన్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా పార్లమెంటు ఎగువ సభ కార్యకలాపాలను సమర్థవంతంగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన అందిస్తున్న సేవలను నేడు యావత్ దేశం గుర్తుచేసుకుంటోంది.






































