కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్డౌన్ 3.0 లో భాగంగా ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై పంజాబ్ ప్రభుత్వం కూడా మే 6, బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనలతో మద్యం విక్రయాలతో పాటుగా హోమ్ డెలివరీకి కూడా అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల వరకు మద్యం హోమ్ డెలివరీకి అనుమతిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు.
కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మద్యం షాపుల వద్ద రద్దీ తగ్గించడం కోసమే హోమ్ డెలివరీకి అనుమతీస్తున్నామని చెప్పారు. ముందుగా పాస్ లు జారీ చేసి, అందుకు అనుగుణంగా డిపార్ట్మెంట్ కి చెందిన వాహనంలో డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం కూడా గ్రీన్జోన్లలో ఆన్లైన్ బుకింగ్ పద్దతి ద్వారా మద్యం హోమ్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఛత్తీస్ఘడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్) అనే యాప్ను డోన్ లోడ్ చేసుకొని ఆన్లైన్లో మద్యం ఆర్డర్ ఇచ్చే విధంగా ఆదేశాలిచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu