తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసారు. మలికిపురంలో పేకాట ఆడుతున్న 9 మందిని ఎస్ఐ కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంతో వారిని విడిచిపెట్టాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులతో కలిసి పోలీసులు స్టేషన్ దగ్గర నిరసన తెలుపుతున్న సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు సోమవారం రాత్రి పోలీసులు ప్రయత్నం చేసారు. అనుచరులు ఇళ్లకు వెళ్లి వాళ్ళను లొంగిపోవాలని కోరారు.
మంగళవారం నాడు ఎమ్మెల్యే రాపాకకు సంబంధించిన 15 మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ను కూడ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అతని ఇంటికి వెళ్లగా, అక్కడ లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ మలికిపురం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే గతంలో కూడ రాపాక పై రెండు కేసులు ఉన్నాయని, తప్పు చేసినపుడు చట్టం ముందు ఎవరైనా సమానమే అని, వారిపై చర్యలు తప్పవని డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=UeQcxFGo1vE]