పెమ్మసాని గెలుపు నల్లేరుపై నడకేనా..

Pemmasani Will Definitely Win, Pemmasani Will Win, Pemmasani Win In Guntur, Pemmasani Will Win In Guntur, Pemmasani Chandrasekhar, TDP MP Candidate, Guntur, AP Elections, Guntur Candidate, Guntur MP Candidate, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani chandrasekhar, tdp mp candidate, guntur, ap elections

పెమ్మసాని చంద్రశేఖర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు గుంటూరు ప్రజలు. ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలిసి హర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పెమ్మసాని ఇంటికి వెళ్లి మద్ధతు తెలియజేస్తున్నారు.   ఇన్ని రోజులు పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలోవున్నప్పటికీ.. గుంటూరులో పేదల కష్టాలు తీర్చుతూ.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనుసులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. గత 20 ఏళ్లుగా పెమ్మసాని కుటుంబం గుంటూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కులం-మతం అనే తారతమ్యాలు లేకుండా సొంత నిధులతో మంచి పనులు చేస్తోంది.

ఇప్పుడు గుంటూరు ప్రజలకు మరింత సేవ చేయాలని.. అరాచకపు పాలనను పారద్రోలాలని పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకొచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఉన్న బలం-బలగం చూసి తెలుగు దేశం పార్టీ ఆయన్ను ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించింది. దీంతో గుంటూరు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ చంద్రశేఖర్ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అయిదేళ్ల వైసీపీ అరాచకపు పాలనను అంతమొందించేందుకు పార్టీ కేడర్‌ను చంద్రశేఖర్ సంసిద్ధం చేస్తున్నారు.

గుంటూరు ప్రజల కష్టాలు తీర్చేందుకు పెమ్మసాని ఇప్పటికే ఎంతో చేశారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి కోసం పనిచేశారు. రాజకీయాల్లో లేనప్పుడే ప్రజల కోసం అంత చేసిన పెమ్మసాని.. ఇప్పుడు మరింత అభివృద్ధి చేస్తామని.. ఎళ్లవేళలా అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. యువళకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని.. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. అయితే ఎక్కడో అమెరికాలో ఉండి ఇన్నిరోజులు తమకోసం ఎంతో చేసిన నాయకుడు.. ఇప్పుడు తమకోసం.. తమ వద్దకే రావడంతో గుంటూరు ప్రజలు హర్షిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు జై కొడుతున్నారు.

రోజురోజుకు గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ బలం, బలగం రెట్టింపు అవుతోంది. ఎంతలా అంటే గుంటూరులో పెమ్మసాని దెబ్బకు వైసీపీ పుణాదులే కుదేలుమంటున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ ముందు వైసీపీ నేతలు నిలవలేకపోతున్నారు. ఆయన్ను దెబ్బకొట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వాటన్నింటిని లెక్కచేయకుండా పెమ్మసాని దూసుకెళ్తున్నారు. గుంటూరులో ఆయన బలం, బలగం, ప్రజల నుంచి వస్తున్న మద్ధతు చూసి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =