ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 299 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 100, విదేశాల నుంచి వచ్చిన వారు 26 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 425 కేసులతో కలిపి జూన్ 18, గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7496 కు చేరింది. ఈ కేసుల్లో 5854 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1642 మంది ఉన్నారు. మరోవైపు ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 92 కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2983 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 77 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 2779 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu