గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను సోమవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ముందుగా గుంటూరులోని పరమయ్యగుంటకు చేరుకున్న లోకేష్, హత్యకు గురైన రమ్య భౌతికకాయానికి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, అండగా ఉంటామని చెప్పారు.
అనంతరం లోకేష్ పర్యటన నేపథ్యంలో పరమయ్యగుంటలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు జరిగింది. రాజకీయ లబ్ధికే లోకేష్ గుంటూరుకు వచ్చారని వచ్చారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపించాయి. ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు, తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు పరామర్శకు వచ్చిన టీడీపీ నేతలు నారా లోకేష్, ప్రత్తిపాడు పుల్లారావు, నక్కా ఆనందబాబు, అలపాచి రాజా, ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారు. నారా లోకేష్ ను పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించగా, మిగతా నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ