ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తుండగా, ఇకపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి జూలై 8, బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స అందించే ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే నిర్దేశించిన రేట్లు ప్రకారం ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ జాబితాలోని ఆసుపత్రులు కూడా నిర్ణయించిన మేరకే ఫీజులు వసులు చేయాలనీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు నిర్ణయించిన ఫీజులు:
- నాన్ క్రిటికల్ కరోనా పేషేంట్లకు(రోజుకు) – రూ. 3,250
- క్రిటికల్ కరోనా పేషెంట్లకు (రోజుకు) – రూ.5,480 (ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా)
- క్రిటికల్ పేషంట్లకు ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచితే (రోజుకు) – రూ.5,980
- ఐసీయూతో పాటు వెంటిలేటర్ (రోజుకు) – రూ.9,580
- ఇన్ఫెక్షన్ అధికంగా ఉండి, వెంటిలేటర్ లేకుండా వైద్యం చేస్తే (రోజుకు) – రూ.6,280
- ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ తో వైద్యం చేస్తే (రోజుకు) – రూ.10,380
- ఆరోగ్యశ్రీ జాబితాలోలేని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేషంట్ ప్రైవేట్ రూమ్ లో ఉండాలనుకుంటే అదనంగా రోజుకు రూ. 600 చెల్లించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu