తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: ఒక్కరోజే 1924 కేసులు, 11 మరణాలు నమోదు

Telangana Corona Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 8, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 29,536 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 6,363 శాంపిల్స్ పరీక్షించగా 4,439 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1590, రంగారెడ్డిలో 99, మేడ్చల్ లో 43, వరంగల్ రూరల్ లో 26, సంగారెడ్డిలో 20, నిజామాబాద్ లో 19, మహబూబ్ నగర్ లో 15, కరీంనగర్ లో 14, నల్గొండలో 13, రాజన్న సిరిసిల్లలో 13, వికారాబాద్ లో 11 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 8, సాయంత్రం 5 గంటల వరకు) :

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 29,536
కొత్తగా నమోదైన కేసులు (జూలై 7- జూలై 8 (5PM-5PM) : 1924
నమోదైన మరణాలు : 11
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 17279
యాక్టీవ్ కేసులు : 11933
మొత్తం మరణాల సంఖ్య : 324

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =