భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 9, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,67,296 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే కొత్తగా 24,879 కరోనా కేసులు, 487 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉండడం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 62.08 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 9, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,67,296
కొత్తగా నమోదైన కేసులు (జూలై 8 – జూలై 9 (8AM-8AM) : 24,879
నమోదైన మరణాలు : 487
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 4,76,378
యాక్టీవ్ కేసులు : 2,69,789
మొత్తం మరణాల సంఖ్య : 21,129
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu