రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జూలై 13, సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే ఈ పరీక్షలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ముందుగా ఈ ప్రవేశ పరీక్షలను జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించాలని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu