తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 1269 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 8,153 శాంపిల్స్ పరీక్షించగా 6,884 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 356 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1563 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 22,482 కి చేరింది. ప్రస్తుతం 11,883 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1269):
- జీహెచ్ఎంసీ ఏరియా – 800
- రంగారెడ్డి -132
- మేడ్చల్ – 94
- సంగారెడ్డి – 36
- కరీంనగర్ – 24
- నాగర్ కర్నూల్ – 23
- మహబూబ్ నగర్ – 17
- వనపర్తి – 15
- నల్గొండ – 15
- మెదక్ – 14
- వరంగల్ అర్బన్ – 12
- నిజామాబాద్ – 11
- పెద్దపల్లి – 9
- మహబూబాబాద్ – 8
- గద్వాల్ – 7
- సూర్యాపేట – 7
- యాదాద్రి – 7
- వికారాబాద్ – 6
- జనగామ – 6
- నిర్మల్ – 4
- జగిత్యాల – 4
- ఆదిలాబాద్ – 4
- మంచిర్యాల – 3
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- సిద్ధిపేట – 3
- రాజన్న సిరిసిల్ల – 3
- వరంగల్ రూరల్ – 2
- ఖమ్మం – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu