మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగతుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 3,10,455 లకు చేరుకుంది. జూలై 19, ఆదివారం నాడు ఒక్కరోజే కొత్తగా 9518 కరోనా పాజిటివ్ కేసులు, 258 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య కూడా 11,854 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 3906 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,69,569 కి చేరింది. ప్రస్తుతం 1,28,730 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆదివారం నాటికీ 15,68,229 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు:
- ముంబయి – 101388
- థానే – 75111
- పుణే – 54624
- పాల్గర్ – 11923
- రాయఘడ్ – 11413
- ఔరంగాబాద్ – 9778
- నాసిక్ – 9533
- జల్గావ్ – 7314
- సోలాపూర్ – 5615
- నాగపూర్ – 2542
- సతారా – 2351
- కొల్హాపూర్ – 2071
- అకోలా – 2049
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu