గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం తేదీని నిర్ణయించింది. కేబినెట్ విస్తరణ జూలై 22న నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జూలై 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందిన నాయకులు కావడంతో, కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu