ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2412 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 20 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 2432 కేసులతో కలిపి జూలై 15, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35451 కు చేరింది. గత 24 గంటల్లో 22,197 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు గత 24 గంటల్లో 44 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన అనంతపూర్ లో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, కర్నూల్ లో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 452 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 18378 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,059 మంది ఆసుపత్రుల్లో, 2562 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 16621 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu