తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూలై 20, సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కరోనా నియంత్రణ చర్యలు, నూతన సెక్రటేరియట్ నిర్మాణం, తదితర అంశాలపై గవర్నర్తో సీఎం చర్చించినున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ ను తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా నిర్మించాలని సీఎం భావిస్తున్నారు. దీంతో నిర్మాణ సంబంధిత వివరాలుపై చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu