ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 7998 కరోనా పాజిటివ్ కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7998 కేసులతో కలిపి జూలై 23, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 72711 కు చేరింది. గత 24 గంటల్లో 58052 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే మరో 5428 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. కరోనా వలన తూర్పు గోదావరి జిల్లాలో పద్నాలుగు మంది, గుంటూరులో ఏడుగురు, కర్నూల్ లో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒకరు, అనంతపురంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 884 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 23, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 14,93,879
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 72711
- కొత్తగా నమోదైన కేసులు : 7998
- నమోదైన మరణాలు : 61
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 37555
- యాక్టీవ్ కేసులు : 34272
- మొత్తం మరణాల సంఖ్య : 884
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu