ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసీఏ కోర్సును ప్రస్తుతం విద్యార్థులు మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తున్నారు. అయితే ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీశ్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్కు ఎంసీఏ కోర్సును రెండేళ్లుగా పరిగణించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్త కరిక్యులమ్ను అమలు చేయాల్సిందిగా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏపీ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ