తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 77,513 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 23,322 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 14 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 615 కి పెరిగింది. ఇప్పటివరకు 54,330 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,568 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.09 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.79 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2256):
- జీహెచ్ఎంసీ – 464
- వరంగల్ అర్బన్ – 187
- రంగారెడ్డి – 181
- మేడ్చల్ – 138
- కరీంనగర్ – 101
- జోగులాంబ గద్వాల్ – 95
- సంగారెడ్డి – 92
- పెద్దపల్లి – 84
- భద్రాద్రి కొత్తగూడెం – 79
- రాజన్న సిరిసిల్ల – 78
- కామారెడ్డి – 76
- నిజామాబాద్ – 74
- ఖమ్మం – 69
- సిద్దిపేట – 63
- నల్గొండ – 61
- జగిత్యాల – 49
- మహబూబ్ నగర్ – 45
- మంచిర్యాల – 44
- జయశంకర్ భూపాలపల్లి – 38
- ఆదిలాబాద్ – 26
- సూర్యాపేట – 25
- యాదాద్రి భువనగిరి – 24
- మహబూబాబాద్ – 23
- ములుగు – 20
- వనపర్తి – 19
- నిర్మల్ – 18
- జనగామ – 18
- వరంగల్ రూరల్ – 16
- మెదక్ – 14
- నాగర్ కర్నూల్ – 13
- వికారాబాద్ – 13
- నారాయణ్ పేట్ – 9
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu