కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. సెప్టెంబర్ 11 న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని బెళగావి లోక్సభ నియోజకవర్గం నుంచి సురేష్ అంగాడి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. సురేష్ అంగాడి మృతి పట్ల పలు పార్టీల రాజకీయ ప్రముఖులు, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu