దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 42,982 కేసులు, 533 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,26,290 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అస్సాం, మిజోరాం, వెస్ట్ బెంగాల్, మణిపూర్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 41,726 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,09,74,748 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.37 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (ఆగస్టు 4 8am–ఆగస్టు 5 8am):
- కేరళ – 22414
- మహారాష్ట్ర – 6126
- ఆంధ్రప్రదేశ్ – 2442
- తమిళనాడు – 1949
- కర్ణాటక – 1769
- ఒడిశా – 1315
- అస్సాం – 1065
- మిజోరాం – 884
- వెస్ట్ బెంగాల్ – 826
- మణిపూర్ – 765
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ