కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెప్టెంబర్ 24, గురువారం నాడు ఢిల్లీలో కలిశారు. కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల, విభజన చట్టంలో పథకాలకు నిధులు, జీఎస్టీ బకాయిలు, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి రావాల్సిన ఇతర పెండింగ్ నిధులు సహా పలు అంశాలపై మంత్రులతో చర్చించినట్టు తెలిపారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిధులను రీయింబర్స్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదించిన అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్టు బుగ్గన పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటుగా ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu