దేశంలో వరుసగా ఆరో రోజు కూడా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 86,508 కరోనా కేసులు నమోదవగా, 87,374 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 75 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 75 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 21029
- ఆంధప్రదేశ్ – 7228
- కర్ణాటక – 6997
- కేరళ – 5376
- తమిళనాడు – 5325
- ఉత్తరప్రదేశ్ – 5143
- ఒడిశా – 4237
- ఢిల్లీ – 3714
- వెస్ట్ బెంగాల్ – 3189
- ఛత్తీస్ గడ్ – 2434
మరోవైపు గత 24 గంటల్లో 1,129 మరణాలు నమోదవగా దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 83 శాతం నమోదయ్యాయి.
1129 మరణాల్లో 83 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 479
- ఉత్తరప్రదేశ్ – 87
- పంజాబ్ – 64
- తమిళనాడు – 63
- వెస్ట్ బెంగాల్ – 61
- ఆంధప్రదేశ్ – 45
- మధ్యప్రదేశ్ – 42
- కర్ణాటక – 38
- ఢిల్లీ – 36
- హర్యానా – 27
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu