దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 13 లక్షలకు చేరువైంది. సెప్టెంబర్ 24, గురువారం నాడు కూడా 19164 కరోనా కేసులు, 459 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,82,963 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 34,345 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 17,184 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 9,73,214 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 75.86 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.68 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,74,993 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు గురువారం నాటికీ మహారాష్ట్రలో 61,90,389 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu