ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ఆలస్యమవడం, విద్యాసంవత్సరాన్ని కుదించడంతో పదో తరగతిలో 7 పేపర్లతో పరీక్షలు నిర్వహణకే మొగ్గుచూపారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ (భౌతికశాస్త్రం, జీవశాస్త్రం), సోషల్ ఇలా మొత్తం 7 పరీక్షలు జరగనున్నాయి. సైన్స్ ను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. జూన్ 17వ తేదీ నుంచి నిర్వహించి, జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ