జింబాబ్వే,బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ మొదలయింది. ఇందులో భాగంగా జరిగిన తోలి మ్యాచ్ లో బంగ్లాదేశ్, జింబాబ్వే జట్టు మీద అద్భుతవిజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ 32 బంతుల్లో 57 పరుగులు చేయగా, కెప్టెన్ మసకద్జా 26 బంతుల్లో 34 పరుగులు చేసారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ వేసిన 16 వ ఓవర్లో ర్యాన్ బర్ల్ వరుసగా 6,4,4,6,4,6 లతో 30 పరుగులు సాధించాడు.
అనంతరం 145 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో అఫీఫ్ హుస్సేన్ 26 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొసద్దిక్ హుస్సేన్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి అండగా నిలవడంతో 17.4 ఓవర్లకే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. 3 వికెట్లతో తేడాతో విజయం సాధించి, ముక్కోణపు టీ20 సిరీస్ లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇక సెప్టెంబర్ 14 న జింబాబ్వే, అఫ్గానిస్తాన్ ల మధ్య ఈ సిరీస్ లో రెండవ టీ20 మ్యాచ్ జరగనుంది.