ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఈసీ గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. పులివెందులలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ, పేదల డాక్టర్గా ఈసీ గంగిరెడ్డి మంచి పేరు సంపాదించారు. ఆయన భౌతికకాయాన్ని పులివెందులకు తరలించారు. ఆయన స్వగ్రామమైన వేముల మండలం గొల్లలగూడూరులో మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu