తెలంగాణరాష్ట్రంలో మరో 1718 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 2, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,97,327 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1153 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.58 (< 1%) శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2,002 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,67,846 కి చేరింది. ప్రస్తుతం 28,328 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 85.05 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 285, రంగారెడ్డి జిల్లాలో 129, మేడ్చల్ లో 115, కరీంనగర్ లో 105, నల్గొండలో 103, ఖమ్మంలో 79, సిద్దిపేటలో 76, సూర్యాపేటలో 60, నిజామాబాద్ లో 58, వరంగల్ అర్బన్ లో 56, భద్రాద్రి కొత్తగూడెంలో 55, రాజన్న సిరిసిల్లలో 52, మహబూబాబాద్ లో 52 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu