భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజుకి 50 వేల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 43,893 కేసులు, 508 మరణాలు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ 28, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 79,90,322 కు, మరణాల సంఖ్య 1,20,010 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటికి కరోనా నుంచి 72 లక్షలు మందికి పైగా కోలుకున్నారు. కొత్తగా 58,439 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 72,59,509 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 90.85 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 28, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 79,90,322
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 27–అక్టోబర్ 28 (8AM-8AM)] : 43,893
- నమోదైన మరణాలు : 508
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 72,59,509
- యాక్టీవ్ కేసులు : 6,10,803
- మొత్తం మరణాల సంఖ్య : 1,20,010
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu