రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఎడ్సెట్-2020 ప్రవేశ పరీక్షను అక్టోబర్ 1, 3 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా టిఎస్ ఎడ్సెట్ ఫలితాలు బుధవారం నాడు విడుదల అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో టిఎస్ ఎడ్సెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షలో 97.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాపిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://edcet.tsche.ac.in/ వెబ్సైట్ లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ను నవంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu