దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,208 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో మహారాష్ట్ర (972), కేరళ (310), కర్ణాటక (195), తమిళనాడు (179), ఢిల్లీ (81), తెలంగాణ (81), హర్యానా (50), వెస్ట్ బెంగాల్ (43) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 12 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,999 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 19 వేలుకు పైగా (19,398 (0.05%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..
కొత్తగా 3,619 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,00,691 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.77 శాతంగానూ, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద అక్టోబర్ 28, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు 219.60 కోట్లకుపైగా (2,19,60,45,500) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 1,60,714 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE