ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2949 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్టోబర్ 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,14,774 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6643 కి పెరిగింది. మరో 3609 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 77,028 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన రాష్ట్రంలో మరో 18 మంది మరణించారు. అనంతపూర్ జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు మరియు విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6643 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 28, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 77,73,681
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,14,774
- కొత్తగా నమోదైనా కేసులు : 2949
- నమోదైన మరణాలు : 18
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 7,81,509
- యాక్టీవ్ కేసులు : 26622
- మొత్తం మరణాల సంఖ్య : 46643
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu