తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1539 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1539 కేసులతో కలిపి నవంబర్ 4, బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,682 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1362 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 2,25,664 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లో 978 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 18,656 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో 44 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం నాడు 44,327 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 44,84,183 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,20,477 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ