ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించి, కోటబొమ్మాలి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో విచారణ తర్వాత అచ్చెన్నాయుడుకు 14 రోజుల పాటుగా ఫిబ్రవరి 15 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. దీంతో అచ్చెన్నాయుడును పోలీసులు అంపోలులో ఉన్న జైలుకు తరలించారు.
ముందుగా నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో మొత్తం 22 మందిపై కోటబొమ్మాలి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో కొంతమందిని సోమవారమే అరెస్టు చేయగా, మంగళవారం ఉదయం నిమ్మాడలోని ఇంటివద్ద అచ్చెన్నాయుడును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ