ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా అందించనుంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు అనుమతి ఇస్తూ సోమవారం నాడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో కలెక్టర్లు ఓ సెల్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక రసీదు, యూనిక్ నంబర్ జారీచేయనున్నట్టు తెలిపారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్కు సిఫార్సు చేశాక, బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో రూ.50 వేల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ