తెలంగాణ రాష్ట్రంలో మరో 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 19, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,97,435 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 157 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,94,097 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 98.87 శాతంగా ఉంది.
కరోనా వలన నిన్న రాష్ట్రంలో ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో మరణించిన వారి మొత్తం సంఖ్య 1623 గా ఉంది. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,715 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 27, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 15, రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్ లో 9, వరంగల్ అర్బన్ లో 8, సంగారెడ్డి లో 6, మంచిర్యాలలో 6, రాజన్న సిరిసిల్లలో 6 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ