రేపే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, అన్ని ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh 4th Phase Grama Panchayat Elections, Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Fourth Phase Panchayat Elections Polling, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, Fourth Phase Panchayat Elections, Fourth Phase Panchayat Elections Polling, Fourth Phase Panchayat Elections Polling In AP, Mango News, Panchayat polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2743 పంచాయతీలు, ఆయా పంచాయతీల పరిధిలో 22,423 వార్డులకు రేపు (ఫిబ్రవరి 21, ఆదివారం) పోలింగ్ జరగనుంది. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కోసం 28,995 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విడతకు సంబంధించి 3299 పంచాయతీలకు, 33,435 వార్డులకు నోటిఫికేషన్ విడుదల అవగా 554 పంచాయితీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రెండు పంచాయతీల్లో, 91 వార్డుల్లో నామినేషన్స్ దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన 2743 పంచాయతీలు, 22,423 వార్డులకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు.

నాలుగో విడతలో సర్పంచ్ స్థానాలుకు 7,475 మంది అభ్యర్థులు, వార్డులకు 52,700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల విధులకు మొత్తం 53,282 మంది సిబ్బందిని ఎన్నికల సంఘం నియమించింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ పక్రియను పర్యవేక్షించనున్నారు. ఇక ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాలలోని గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =