ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు విడతల సందర్భంగా నామినేషన్లు దాఖలు కాకపోవడం, సాంకేతిక కారణాల వలన ఎన్నికలు జరగని 12 పంచాయతీలు, 725 వార్డులకు మంగళవారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నెల్లూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 12 సర్పంచ్ స్థానాలకు, అలాగే వార్డు స్థానాలకు మార్చి 15 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
12 పంచాయతీలు, 725 వార్డులకు ఎన్నికల షెడ్యూల్:
- నామినేషన్ల స్వీకరణ : మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు
- నామినేషన్లకు గడువు : మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు
- నామినేషన్ల పరిశీలన : మార్చి 8
- నామినేషన్ల ఉపసంహరణ : మార్చి 10 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
- పోలింగ్ తేదీ : మార్చి 15 (ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు)
- ఓట్ల లెక్కింపు : మార్చి 15 (సాయంత్రం 4 గంటల నుంచి)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ