రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్

Defense Minister Rajnath Singh, KTR Meets Defense Minister Rajnath Singh, KTR Meets Defense Minister Rajnath Singh In Delhi, KTR Meets Minister Rajnath Singh In Delhi, KTR Meets Rajnath Singh In Delhi, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్ట్ర మునిసిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అక్టోబర్ 30, బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. కేంద్ర సెక్రటేరియట్ సౌత్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌ సింగ్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ముఖ్యంగా, నగరంలో ఉన్న రక్షణ శాఖ భూముల అప్పగింత గురించి చర్చించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌ – నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ – రామగుండం జాతీయ రహదారులను మరింతగా విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని రాజ్‌నాథ్‌ సింగ్ ను మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోనందు వలన, ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ భూముల అప్పగింతపై సానుకులంగా నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ తో జరిగిన సమావేశ వివరాలు తెలియజేస్తూ, కేంద్రమంత్రి తో దిగిన ఫోటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =