సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయనకు పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించాలని జైలు అధికారులను, పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సిటి స్కాన్ పరీక్షలు నిర్వహించగా నరేంద్రకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో నరేంద్రను పోలీసులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయి కరోనా బారినపడిన సంగం డైరీ ఎండీ గోపాల కృష్ణన్ కు కూడా ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ