రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్(82) కన్నుమూశారు. ఏప్రిల్ 20న కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాజీ ప్రధాని చరణ్సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. దేశంలో రైతుల సమస్యలపై గళం విప్పిన నాయకుడిగా నిలిచారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ స్థాపించి ఉత్తరప్రదేశ్ లో బలమైన నాయకుడిగా ఎదిగారు. రాజ్యసభ ఎంపీగా, పలుమార్లు లోక్సభ ఎంపీగా, పలు ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా అజిత్ సింగ్ సేవలు అందించారు. అజిత్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ