ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 89,087 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3432, చిత్తూరులో 2708, అనంతపూర్ లో 2213, విశాఖపట్నంలో 2200 నెల్లూరులో 1733, గుంటూరులో 1733 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,88,803 కు చేరుకుంది.
ఇక కరోనా వలన అనంతపూర్ లో పదకొండు మంది, తూర్పుగోదావరిలో పది మంది, విశాఖపట్నంలో పది మంది, పశ్చిమగోదావరిలో పది మంది, విజయనగరంలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కృష్ణాలో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, కర్నూల్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కడపలో నలుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9173 కి పెరిగింది. గత 24 గంటల్లో 19177 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 11,75,843 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,03,787 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ