కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌

AP Governor, ap governor biswabhusan harichandan, AP Governor Took Covid-19 Vaccine, biswabhusan harichandan, Biswabhusan Harichandan Took Covid-19 Vaccine, Biswabhusan Harichandan Took First Dose of Covid-19 Vaccine, Corona Vaccination Drive, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Mango News

దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ దంపతులు మంగళవారం నాడు కరోనా‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. విజయవాడ నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో గవర్నర్‌ దంపతులకు వైద్య సిబ్బంది తొలిడోసు కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్తవేత్తలను గవర్నర్ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ ప్రశంసించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హులైన ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

మరోవైపు మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హార్షవర్ధన్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్, భారత్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రవిశాస్త్రి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 11 =