ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, బుధవారం ఒక్కరోజే 6,28,961 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు లబ్దిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 45,71,465 కి చేరినట్టు తెలిపారు.
మరోవైపు గురువారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 11.44 కోట్లు (11,44,93,238) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందులో 10,01,79,199 మందికి మొదటి డోస్ మరియు 1,43,14,039 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు. ఇక టీకా ఉత్సవ్ (ఏప్రిల్ 11-14) లో భాగంగా దేశవ్యాప్తంగా అర్హతగల 1,28,98,314 ప్రజలకు వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ