తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా టీఆర్ఎస్ నాయకుడు వంటెరు ప్రతాప్ రెడ్డి నవంబర్ 6, బుధవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనపై ఉంచి బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తగిన కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.
[subscribe]