ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ, గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నవంబర్ 5, బుధవారం నాడు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఎల్వీ సుబ్రమణ్యం డిసెంబర్ 6వ తేదీ వరకు సెలవులు పెట్టినట్టు సమాచారం. హెచ్ఆర్డీ డీజీగా ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. మరో ఐదునెలల పాటు ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సర్వీసు ఉండగానే సీఎస్ బాధ్యతల నుంచి బదిలీ చేయడంతో అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమయింది. రాష్ట్రంలో విపక్ష పార్టీల నాయకులు సైతం ఎల్వీ సుబ్రహ్మణ్యంను తొలిగించిన విధానంపై పలు రకాల ప్రశ్నలతో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్త సీఎస్ ను నియమించేవరకు నీరబ్కుమార్ ప్రసాద్ విధులు నిర్వహించనున్నారు.
[subscribe]