కరోనాతో ఒకేరోజులో 402 మంది మృతి, మరో 18600 పాజిటివ్ కేసులు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19,mango news

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 30, ఆదివారం కూడా 18,600 కరోనా కేసులు, 402 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,31,815 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 94,844 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 22,532 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 53,62,370 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.55 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.65 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,71,801 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 3,48,61,608 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ