ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 84,232 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2598, చిత్తూరులో 1971, అనంతపూర్ లో 1215, విశాఖపట్నంలో 1054 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,85,142 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 94 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో పద్నాలుగు మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, కృష్ణాలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కడపలో నలుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 10832 కి పెరిగింది. గత 24 గంటల్లో 21133 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 15,08,515 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ