సీనియర్ నటుడు టి.విజయ్ చందర్కు కీలక పదవి దక్కింది. ఆయనను రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి నవంబర్ 11, సోమవారం నాడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ ప్రారంభం నుంచే టి.విజయ్ చందర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో కూడ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీకి సేవలందించిన పలువురుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవులు అప్పగిస్తున్నారు. చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించబడ్డ విజయ్ చందర్ 1967 సంవత్సరంలో సుడిగుండాలు సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు. కరుణామయుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు, శ్రీషిర్డీ సాయిబాబాతో పాటు అనేక సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషించారు.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -