ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 10, సోమవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,860 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు వైద్యం అందించడం, ఇతర కరోనా సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా 30,887 మెడికల్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుధ్య సిబ్బంది, సహా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 30,887 మందిని నియమించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ఇప్పటికే 8439 మందిని భర్తీ చేసుకున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమించే వీరి నియామక పక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుంది. వీటితో పాటుగా వైద్య శాఖలో రెగ్యులర్ నియామకాల భర్తీకి కూడా పక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలతో ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu